Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమ.. ఇంకో వ్యక్తితో జంప్.. ఎక్కడ?

ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పా

ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమ.. ఇంకో వ్యక్తితో జంప్.. ఎక్కడ?
, సోమవారం, 16 జులై 2018 (13:59 IST)
ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ జిల్లాకు చెందిన ఓ యువతికి పెద్దలు అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. అతనితో రెండు రోజులపాటు కాపురం చేసింది. ఆ తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసింది. అతనితో మరో ఏడడుగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు మాత్రమే సంసారం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తితో జంప్‌ అయింది. ఇది కొరాపుట్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
 
దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూలదండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండో భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్లున్న కబోదుల్లా మారిన కాంగ్రెస్ నేతలు : గుత్తా సుఖేందర్ రెడ్డి