Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గోసంరక్షకులు చేష్టలు శృతిమించిపోతున్నాయి. జంతు ప్రదర్శనకు గోవులను తరలిస్తున్నారన్న ఆరోపణలపై 24 మందిని అదుపులోకి తీసుకున్న గోసంరక్షకులు... వారిని మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా నుంచి మహారాష్ట్రలో జరుగుతున్న ఓ జంతు ప్రదర్శనకు కొంతమంది గోవులను తరలిస్తున్నారు. ఈ విషయం కొంతమంద గోసంరక్షకుల దృష్టికెళ్లింది. అయితే, ఈ గోవులను గోవధకు తరలిస్తున్నారని గోసంరక్షకులు భావించి, వారందరినీ అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత చేతులను తాళ్ళతో కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు. వారితో బలవంతంగా గోమాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు. ఆ తర్వాత వారిని తన్నుకుంటూ ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. గోవులను తరలిస్తున్న వారితో పాటు వారిని హింసించిన గోసంరక్షకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments