Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిలాఫలకం వేశా... వచ్చారో కాళ్లూ చేతులూ నరికేస్తా : ఎమ్మెల్యే వార్నింగ్

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (15:05 IST)
కర్ణాటక శాఖ అటవీ శాఖ అధికారిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర రెచ్చిపోయారు. బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ శిలాఫలకం వేశాను. పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అడ్డుకునేందుకు ఏ ఒక్క అధికారి ఇక్కడకు రాకూడదు. వచ్చారో కాళ్లూ చేతులు నరికేస్తా. మంచి మాటలు మీచెవికెక్కవు. ఇదే నా హెచ్చరిక అంటూ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ వివాదం రేపుతోంది.
 
కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని కొందరు గ్రామస్థులు నిర్ణయించారు. అనుకున్నదే తడవు డిసెంబరు 31వ తేదీన శంకుస్థాపన కూడా జరిపించారు. అయితే ఆ నిర్మాణంపై అటవీ శాఖ అధికారి ఒకరు అభ్యంతరం వ్యక్తంచేశారు. అటవీ శాఖ భూమిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారి చెప్పారు. 
 
ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంగమేశ్వరర్ దృష్టిసారించారు. దీంతో సదరు అధికారికి సంగమేశ్వర్ నేరుగా ఫోను చేశారు. స్వయంగా తానే ఇక్కడ శిలాఫలకం వేశానని, పని కూడా మొదలవుతుందని చెబుతూ... ఎవరైనా అడ్డుకుంటే కాళ్లూ చేతులూ నరికేస్తామంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం మొత్తం వీడియోలో రికార్డు కావడంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments