Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాజ్‌కు బీజేపీ పగ్గాలు.. గడ్కరీకి ఉప ప్రధాని పదవి : బీజేపీ నేత లేఖ

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (14:01 IST)
భారతీయ జనతా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సంఘ్ ప్రియా గౌతమ్ రాసిన లేఖ ఇపుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీని దేశ ఉప ప్రధానమంత్రిగా నియమించాలని ఆయన కోరారు. అంతేకాకుండా, కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన తన లేఖలో కోరారు. 
 
అలాగే, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రాజ్యసభపై ఎక్కువ దృష్టి సారించాలని, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను భాజపా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని కోరారు. 88 ఏళ్ల సంఘ్‌ ప్రియా... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
 
ఇప్పటివరకూ చక్రం తిప్పిన అగ్ర రాజకీయ నాయకులందరిలో మోడీ కూడా ఉంటారని, ఆయన హవా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కొన్ని మినహా ఎక్కువ రాష్ట్రాల్లో భాజపానే విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments