Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మగబిడ్డ పుట్టలేదనీ భార్యపై కిరోసిన్ పోసి...

భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:49 IST)
భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరులోని కొప్పాగేటు ప్రాంతానికి చెందిన శశికుమార్, వీణలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. తన భార్యకు మగపిల్లాడు పుట్టలేదనే కోపంతో భర్త శశికుమార్ భార్య వీణను వేధిస్తూ వచ్చాడు. రెండో ఆడబిడ్డ పుట్టాక భార్యతో భర్త ప్రతీరోజూ గొడవ పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో రాత్రివేళ భార్య వీణపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనపై వీణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను చంపిన భర్త శశికుమార్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో అతను భార్యను హతమార్చినట్లు అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments