Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొట్టిని కారు.. తెరుచుకోని ఎయిర్‌బ్యాగులు - ఎమ్మెల్యే కుమారుడు మృతి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:59 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమిత వేగంతో వచ్చిన ఓ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగ‌తా న‌లుగురు కూర్చున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 
 
మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వ‌య‌సున్న వారే.. మృతులను క‌రుణా సాగ‌ర్‌, బిందు (28), అక్ష‌య్ గోయ‌ల్, ఇషిత (21), ధ‌నూష (21), రోహిత్‌, ఉత్స‌వ్‌గా గుర్తించారు. వీరిలో క‌రుణా సాగ‌ర్‌, బిందు భార్యాభ‌ర్త‌లు. సెయింట్ జాన్స్ హాస్పిట‌ల్‌లో మృతదేహాల‌కు పోస్టుమార్టం నిర్వ‌హించారు.
 
అయితే, ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేద‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్క‌రూ కూడా సీటు బెల్ట్ ధ‌రించ‌లేద‌ని, అందుకే కారులోని ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదని పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments