Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం.. మీడియాకు మార్గదర్శకాలు

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (17:19 IST)
అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పుకు అనంతరం సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిస్థాయిలో సమీక్షించిన వక్ఫ్ బోర్డు, అయోధ్య వివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది.
 
అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పు రాగానే సున్నీ వక్ఫ్ బోర్డు ఆచితూచి వ్యవహరించాలని భావించినా, కొన్నిగంటల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రివ్యూ పిటిష న్ దాఖలు చేయకూడదని నిర్ణయించినట్లు ప్రకటించింది. 
 
మరోవైపు అయోధ్య తీర్పుకు అనంతరం మీడియాకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలను నిరోధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మార్గదర్శకాలు జారీచేసింది. చానళ్లలో చేపట్టే చర్చా కార్యక్రమాలు, డిబేట్లు, రిపోర్టింగ్ సందర్భంగా ప్రోగ్రామ్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. 
 
ఛానెళ్లతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా ప్రోగ్రామ్ కోడ్‌ను పాటించాలని స్పష్టం చేసింది. ఇది అన్ని చానళ్లకు, దేశంలోని అందరు కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments