Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్యపై యావద్భారతం సాధించిన విజయం : వెంకయ్య నాయుడు

అయోధ్యపై యావద్భారతం సాధించిన విజయం : వెంకయ్య నాయుడు
, శనివారం, 9 నవంబరు 2019 (16:42 IST)
ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై శనివారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. 'అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వడం శుభపరిణామం. చాలా ఏళ్లుగా కొనసాగుతున్నసమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన ఘన విజయమిది' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలి. మన సర్వమానవ సౌభ్రాతత్వ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ.. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకునేందుకు లక్ష్యంతో పనిచేయాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో మందిర నిర్మాణానికి అనుకూలం.. బీజేపీకి డోర్లు క్లోజ్ : కాంగ్రెస్