Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

ఠాగూర్
సోమవారం, 14 జులై 2025 (21:26 IST)
గత జూన్ నెల 12వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి ఇంజన్‌కు ఇంధన సరఫరా చేసే స్విచ్‌లను ఆఫ్ చేయడం వల్లే జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచన చేసింది. 
 
అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ ఇన్ఫర్మేషన్ బులిటెన్ ప్రకారం ప్రస్తుతం అనేక అంతర్జాతీయ, దేశీయ విమాన సంస్థలు వారి విమానాల్లో ఇంధన స్విచ్‌ల తనిఖీలు ప్రారంభించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో బోయింగ్ ఆపరేటర్లు ఈ నెల 21వ తేదీలోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత నివేదికను డీజీసీఏకు సమర్పించాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments