పాకిస్తాన్ జైలులో 20 ఏళ్లు గడిపి ఇంటికి తిరిగొచ్చిన భారతీయుడు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (22:37 IST)
పాక్ జైలులో 20 ఏళ్లు గడిపి తాజాగా విడుదలయ్యాడు ఓ భారతీయుడు. నిన్న తన సొంతింటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపాడు. ఒడిశాలోని సుందర్‌ఘర్‌ జిల్లాకు చెందిన బ్రిజు కుల్లు అనే గిరిజనుడు 1995లో పాతికేళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేసి, పంజాబ్‌కు చేరుకుంటున్న సమయంలో పొరపాటున పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాడు.
 
అది నేరం అని అతనికి తెలియదు. అక్కడ అతనిని గుర్తించిన పాకిస్థాన్ సైనికులు అతనిని భారత గూఢచారిగా అనుమానించారు. దాంతో అరెస్టు చేసి జైలుకి తరలించడంతో 20 ఏళ్లకు పైగా లాహోర్‌ జైలులోనే గడిపాడు. రెండు వారాల క్రితం అతనిని పాకిస్థాన్ విడుదల చేయడంతో భారత్‌ చేరుకున్నాడు. 14 రోజుల పాటు అమృత్‌సర్‌లోని కరోనా ఆసుపత్రిలో ఉన్నాడు.
 
నిన్న అతనిని సంబంధిత అధికారులు సొంత గ్రామం జంగతేలికి తీసుకెళ్లారు. ఇన్నేళ్ల తర్వాత సొంత గ్రామానికి వచ్చిన అతనికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అతనికి పూలమాలలు వేస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఇన్నాళ్లకు ఇంటికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందనీ, బంధువులు, స్నేహితులను గుర్తుపడుతున్నానని బ్రిజు చెప్పాడు.
 
పాక్ జైలులో ఒక సెల్‌లో తనతో పాటు ఇరవై మంది ఖైదీలను వుంచేవారనీ, సమయానికి ఆహారాన్ని మాత్రం పెట్టేవారని చెప్పాడు. ఎప్పటికైనా ఇంటికి చేరుకోవాలని కోరుకున్నానని, తన ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఇక తన శేష జీవితాన్ని స్వగ్రామంలోనే గడుపుతానని బ్రిజు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments