Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా మఫ్లర్ ధర రూ.80 వేలు.. రాహుల్ టీ షర్టుపై రాజకీయాలా?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (14:15 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇపుడు కేరళ రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. అయితే, ఈ యాత్రా సమయంలో రాహుల్ గాంధీ ధరించిన ఓ టి షర్టు ధర రూ.45 వేలు అంటూ బీజేపీ శ్రేణులు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ అయింది. బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ధీటుగానే కౌంటరిచ్చారు. రాహుల్ ధరించిన టీ షర్టు ధర రూ.45 అయితే, ప్రధాని మోడీ ధరించే కళ్లద్దాల ధర రూ.85 వేలు, ఆయన ధరించే కోటు ధర రూ.10 లక్షలు అంటూ కౌంటరిచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు తోకముడిచాయి. 
 
తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. టీ షర్టుల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని చెప్పారు. బీజేపీ నేతలు ధరించే సన్ గ్లాసెస్ ధర రూ.2.50 లక్షలకు పైగానే ఉంటుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. 
 
"బీజేపీ నేతలకు రూ.2.50 లక్షల సన్ గ్లాసెస్‌, రూ.80 వేల మఫ్లర్లు ధరిస్తూ రాహుల్ గాంధీ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకుపైనే ఉంటుంది. అయినా టీ షర్టులపై బీజేపీ రాజకీయాలు చేస్తుంది" గెహ్లాట్ కౌంటరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments