Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amit Shah: తమిళం మాట్లాడలేకపోతున్నా సారీ: అమిత్ షా

సెల్వి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (17:13 IST)
తమిళనాడు ప్రజలు తమిళం మాట్లాడలేకపోతున్నానని.. ఇందుకోసం తనను క్షమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. తమిళం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి అని ఆయన అంగీకరించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
 
2024 సంవత్సరాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించిన అమిత్ షా, నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని పునరుద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలలో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. 
 
2026 తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా, రాజవంశ రాజకీయాలు, అవినీతిపై బిజెపి తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments