Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న ఒమిక్రాన్ వైరస్ - పంజాబ్‌లో విద్యా సంస్థల మూసివేత

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (15:39 IST)
దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో కూడా ఏకంగా 35 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇపుడు పంజాబ్ రాష్ట్రం కూడా కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ముఖ్యంగా, రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలను మూసివేయాలని ఆదేశించింది. 
 
అలాగే, క్రీడా ప్రాంగణాలు, ఈతకొలనులు, వ్యాయామశాలను పూర్తిగా వేయాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధించింది. అయితే, విద్యా సంస్థలు మూసివేసిన దరిమిలా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. 
 
ఇకపోతే, మల్టీప్లెక్స్‌లో, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, మద్యంబార్లు, షాపింగ్ మాల్స్, స్పాలు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియం‌లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని పంజాబ్ సర్కారు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments