Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో శీతాకాల సెలవులు.. పాఠశాలల మూసివేత

ఢిల్లీలో శీతాకాల సెలవులు.. పాఠశాలల మూసివేత
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాల సెలవుల కోసం పాఠశాలలు మూసివేస్తున్నందున ఎటువంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించబడవని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. 
 
విద్యార్థులకు బోధనా కార్యకలాపాలు నిర్వహించబడవు, విద్యాభారాన్ని తగ్గించడానికి, పాఠశాలలు ఇప్పటివరకు కవర్ చేయబడిన 2021-22 విద్యా సంవత్సరం సిలబస్‌ను సవరిస్తాయి. సర్వోదయ విద్యాలయ యాజమాన్యాలు సెలవుల విషయమై వారి తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది. 
 
ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1103కి చేరింది. దేశ రాజధానిలో COVID-19 మార్గదర్శకాలతో పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి. అయితే.. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు, బలహీనతలను గమనించి.. శీతాకాల సెలవుల తర్వాత, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కేటాయించబడుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బాయ్ రమణా... అని ఊళ్ళో పెద్దలు పలకరించ‌డం ఓ పుల‌కింత‌!