Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగాల్‌లో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - స్కూల్స్ మూసివేత

బెంగాల్‌లో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - స్కూల్స్ మూసివేత
, సోమవారం, 3 జనవరి 2022 (15:57 IST)
వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 
 
కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విద్యా సంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్‌లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరిపాలనా పరమైన సమావేశాలను కేవలం వర్చువల్ విధానంలో చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
అలాగే, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవాలని కోరింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఇక సమావేశాలకు 200 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మందికి అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, కోల్‌కతాలో నే గత మూడు రోజుల్లో మూడు రెట్లు, బెంగాల్‌లో 5.47 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ - కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశం