Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్ష సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (20:49 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి జరుగనున్నాయి. దీంతో గత శీతాకాల సమావేశాల్లో విపక్ష సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఎత్తివేశారు. గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. అనూహ్యరీతిలో చొరబడిన వ్యక్తులు సభలోకి దూసుకొచ్చారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న 14 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై ఇపుడు సస్పెన్షన్ ఎత్తివేశారు. 
 
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతోనూ, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్‌తో చర్చించారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున కోరడంతో అందుకు వారు అంగీకరించారు. 
 
దీంతో నిర్ణయంతో రాజ్యసభలో 11 మంది ఎంపీలపై, లోక్‌సభలో ముగ్గురు ఎంపీలపై విధించిన సస్పెన్షన్ తొలగిపోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులోకి అగంతకులు చొరబడిన ఘటనలో సదరు ఎంపీలు సభల తీవ్ర ఆందోళనకు దిగడంతో వీరిని సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments