Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోడీ మళ్లీ గెలిస్తే దేశంలో నియంత పాలనే : మల్లికార్జున ఖర్గే

mallikarjuna kharge

వరుణ్

, మంగళవారం, 30 జనవరి 2024 (10:30 IST)
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశంలో నియంత పాలన సాగుతుందని, దేశానికి ఇచే చివరి ఎన్నికలు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు. 
 
అప్పుడు దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. నరేంద్ర మోడీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదన్నారు. మోడీ మళ్లీ గెలిస్తే దేశ ప్రజలు వేసే చివరి ఓటు 2024 సార్వత్రిక ఎన్నికలే అవుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇస్తున్నారని... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భయం వల్లే కొంతమంది I.N.D.I.A. కూటమి నుంచి... మరికొందరు పార్టీ నుంచి వెళుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
'ఇదే మీకు చివరి అవకాశం.. ఓటు వేయండి... దీని తర్వాత మోడీ గెలిస్తే ఓటింగ్ ఉండదు' అని వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆ పార్టీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్‌ను ఓ విషపు పురుగా ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నారని... తాను 'మొహబ్బత్ కీ దుకాన్'ను ప్రారంభించానని చెప్పారని గుర్తు చేశారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు  'నఫ్రత్కీ దుకాన్'కు తెరదీశారని ఆరోపించారు. ఈ కారణంగా మీరు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాల్దీవుల అధ్యక్షుడికి మరిన్ని చిక్కులు ... అభిశంసన తీర్మానం