Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాల కోసం అక్షయ్ కుమార్ కోటిన్నర విరాళం

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (05:34 IST)
ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈసారి హిజ్రాల కోసం ముందుకొచ్చాడు. దర్శకుడు రాఘవ లారెన్స్‌, అక్షయ్ కలిసి చెన్నైలో తొలిసారి హిజ్రాల కోసం ఇళ్లు నిర్మించబోతున్నారు.

ఇందుకోసం అక్షయ్ కుమార్ కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించాడు. ఈ మేరకు నేడు (ఆదివారం) లారెన్స్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్ల (హిజ్రాలు)కు చెక్కు బహూకరించాడు. బాలీవుడ్ ఫొటో గ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ అయింది.

మరోవైపు లారెన్స్ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. హిజ్రాల గృహ నిర్మాణం కోసం ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలోనే ఇది తొలిసారని ప్రశంసించాడు.
 
‘‘నేను మీతో ఒక శుభవార్తను పంచుకోవాలనుకుంటున్నాను. అక్షయ్ కుమార్ సార్ దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల ఇళ్ల నిర్మాణం కోసం కోటిన్నర రూపాయలు విరాళంగా అందించారు.

మా ట్రస్ట్ ద్వారా భూమిని సేకరిస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తాం. ‘లక్ష్మీబాంబ్’ షూటింగ్ సందర్భంగా మా ట్రస్ట్ ప్రాజెక్టుల గురించి, హిజ్రాలకు ఇళ్ల నిర్మాణం గురించి అక్షయ్ సార్‌తో మాట్లాడా.

ఆ విషయం విన్న వెంటనే మరేమీ మాట్లాడకుండా ఇళ్ల నిర్మాణానికి రూ.కోటిన్నర విరాళం ఇస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆయన ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు’’ అని లారెన్స్ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments