Publish Date: Wed, 29 Jan 2020 (16:19 IST)
Updated Date: Wed, 29 Jan 2020 (16:21 IST)
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ఈ రోజు అనగా ది.29-01-2020వ తేదిన #67-2-14/8, అశోక్ నగర్, G.P.T.కాలని, కాకినాడ కు చెందిన శ్రీ కె.వెంకట అనిల్ కుమార్, జయ ప్రియాంక గార్లు శ్రీ కనకదుర్గ అమ్మవారికి 63 గ్రాముల కలిగిన బంగారు గాజులను ఆలయ అధికారులను కలసి అందజేసినారు.
దాతలకు శ్రీ అమ్మవారి దర్శనం అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రము, చిత్ర పటము, ప్రసాదములును అందజేసినారు.