Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజా మందిరంలో పార్వతీపరమేశ్వరుని కుటుంబం ఫోటో వుంటే?

పూజా మందిరంలో పార్వతీపరమేశ్వరుని కుటుంబం ఫోటో వుంటే?
, సోమవారం, 27 జనవరి 2020 (21:27 IST)
శివ కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరాలలో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం కొందరికి కలుగుతుంటుంది. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచడం చాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. పార్వతీపరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు.

అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు. 
 
విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-01-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఈశ్వరుడిని పూజిస్తే..?