Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఒక్కసారి పోటీ చేయండి.. అమిత్ షా : కుదరదు.. ధన్యవాదాలు.. అద్వానీ

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:09 IST)
భారతీయ జనతా పార్టీలో భీష్మపితామహులు పేరుగడించిన రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో బీజేపీలో అద్వానీ శకం ఇక ముగిసినట్టే. నిజానికి గత 2014 ఎన్నికల్లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బలవంతం మీద ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గాంధీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 
 
అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే స్థానం పోటీ చేయాలని అద్వానీని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. అద్వానీని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా ఒప్పించేందుకు ఆయన నివాసానికి అమిత్ షా వెళ్లారు. అపుడు గాంధీ నగర్ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. 
 
దాంతో, కనీసం ఎల్.కె.అద్వానీ సంతానమైన ప్రతిభ, జయంత్‌లలో ఒకరిని గాంధీనగర్‌ బరిలో దింపాలని, వారిని గెలిపించుకొనే బాధ్యతను తీసుకుంటామని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా అద్వానీ నిరాకరించారు. 'కుదరదు. ధన్యవాదాలు' అని ముక్తసరిగా చెప్పి అమిత్‌షాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments