Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ దంపతులను డబ్బు కోసం చంపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:34 IST)
తల్లీ కొడుకులు కలిసి డబ్బు కోసం వృద్ధ దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో వీరేందర్ కూమార్ ఖనేజా (77), సరళ (72) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 
 
వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వారిని దారుణంగా చంపి 9 లక్షల నగదును, బంగారు ఆభరణాలను చోరీ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈనెల 26వ తేదీన ఆ వృద్ధ దంపతులు కనిపించడం లేదని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వారి ఫ్లాట్‌ను బలవంతంగా తెరిచి చూసారు, అక్కడ ఇద్దరూ శవాలుగా కనిపించారు.
 
దుండగులు ఫ్లాట్ లోపలి వైపు తాళం వేసి దంపతుల ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసారు. బాధితుల కుమారుడు డాక్టర్‌ అమిత్‌ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి ఇంట్లో పనిచేసే మహిళను తమదైన రీతిలో విచారణ చేయగా అసలు విషయం బయటపెట్టింది. డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు ఒప్పుకుంది.
 
జనవరి 18న వీరేందర్‌ ఖనేజా లాకర్‌లో డబ్బును ఉంచడం గమనించిన నిందితురాలు అదే రోజు మధ్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తమ కుమారుడితో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు సమాచారం అందించారు. వారి నుండి 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments