Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరాఢా ఝుళిపించిన ఈసీ : ఏ.రాజాపై 48 గంటల ప్రచార నిషేధం

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:55 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయన చేసిన వ్యాఖ్యల పర్యావసానంగా ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. 48 గంట‌ల పాటు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌రాదు అని త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి రానున్నాయి. 
 
తమిళనాడు శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామిపై ఏ రాజా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విషయం తెల్సిందే. ఇటీవ‌ల ఓ ప్ర‌చార స‌భ‌లో రాజా మాట్లాడుతూ.. సీఎం ప‌ళ‌నిస్వామి త‌ల్లి గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఘ‌ట‌న‌లో ఏ రాజా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. 
 
అయితే, రాజా చేసిన వ్యాఖ్య‌లు అస‌భ్య‌క‌రంగా ఉన్నాయ‌ని, మ‌హిళల గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ట్లు ఉన్నాయ‌ని, ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం ఆరోపించింది. అన్నాడీఎంకే నేతల ఫిర్యాదుతో ఈసీ కొరఢా ఝుళిపించింది. కాగా, ఏప్రిల్ ఆరో తేదీన త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments