Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కల కాళ్లు - మూతులను తాళ్ళతో కట్టేసి చంపేశారు...

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:28 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 90 మూగజీవులైన శునకాలను అత్యంత కిరాతకంగా చంపేశారు. కాళ్ల, మూతులను తాళ్లతో కట్టేసి ఒకేచోట చంపేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గిర్దా - సవల్దాబారా రోడ్డుకు పక్కన ఉన్న పదుల సంఖ్యలో కుక్కల కళేబరాలు పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గిర్డా రహదారిని పరిశీలించగా.. ఐదు ప్రాంతాల్లో సుమారు 90 శునకాల కళేబరాలను గుర్తించారు. 
 
ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు కుక్కల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్కల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుక్కలను పట్టేవారిని కూడా విచారిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments