Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధానమంత్రి సెగ్మెంట్‌లోని స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు

ప్రధానమంత్రి సెగ్మెంట్‌లోని స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:52 IST)
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. 
 
ఈ పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల మేరకు కరెంట్ బిల్లు వచ్చింది. ఊహించని ఈ పెను ఉత్పాతాన్ని చూసి పాఠశాల యాజమాన్యం షాక్‌కు గురైంది. విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోయిందని స్కూలు సిబ్బంది వాపోతున్నారు. 
 
పైగా, ఈ మొత్తాన్ని ఈ నెల ఏడో తేదీలోపు చెల్లించని పక్షంలో పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ఈబీ అధికారులను వివరణ కోరగా, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదనీ, గతంలోనూ ఇదే విధంగా వచ్చిందని వారు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో భారీ వర్షాలు.. సముద్రాన్ని తలపిస్తున్న రహదారులు (ఫోటోలు)