Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఏడుగురు యువతులను మింగేసిన వాగు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వాగు ఏడుగురు యువతులను మింగేసింది. కెడిలం వాగులో ఈ ఏడుగురు అమ్మాయిలు మునిగిపోయారు. ఎండవేడిమిని తట్టుకోలేక వాగుల స్నానం చేసేందుకు ఈ ఏడుగురు యువతులు వెళ్లారు. వీరంతా వాగులో స్నానం చేస్తుండగానే ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. నలుగురు యువతులను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు యువతులు విగతజీవులయ్యారు. దీంతో మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. 
 
ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని కడలూరు జిల్లా కుచ్చిపాళెయంలోని కెడిలం వాగులో జరిగింది. ఈ వాగులోకి ఉక్కపోతను తట్టుకోలేక స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్టుండి వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఆ యువతులు నీటిలో మునిగిపోయారు. 
 
మృతులను సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోని,్ (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)లుగా గుర్తించారు. వీరంతా కుచ్చిపాళెయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ప్రియదర్శిని, దివ్యదర్శినిలు అక్కా చెల్లెళ్ళు. దీంతో వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలకు ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments