Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఏడుగురు యువతులను మింగేసిన వాగు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వాగు ఏడుగురు యువతులను మింగేసింది. కెడిలం వాగులో ఈ ఏడుగురు అమ్మాయిలు మునిగిపోయారు. ఎండవేడిమిని తట్టుకోలేక వాగుల స్నానం చేసేందుకు ఈ ఏడుగురు యువతులు వెళ్లారు. వీరంతా వాగులో స్నానం చేస్తుండగానే ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. నలుగురు యువతులను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు యువతులు విగతజీవులయ్యారు. దీంతో మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. 
 
ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని కడలూరు జిల్లా కుచ్చిపాళెయంలోని కెడిలం వాగులో జరిగింది. ఈ వాగులోకి ఉక్కపోతను తట్టుకోలేక స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్టుండి వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఆ యువతులు నీటిలో మునిగిపోయారు. 
 
మృతులను సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోని,్ (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)లుగా గుర్తించారు. వీరంతా కుచ్చిపాళెయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ప్రియదర్శిని, దివ్యదర్శినిలు అక్కా చెల్లెళ్ళు. దీంతో వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలకు ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments