నైజీరియాలో మారణహోమం - చర్చిలోని భక్తులపై కాల్పులు - 50 మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:31 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైనా నైజీరియాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న భక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు తెగబడ్డారు. బాంబులు విసిరారు. దీంతో 50 మందికి వరకు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ఆ తర్వాత చర్చి ఫాస్టర్‌ను కిడ్నాప్ చేశారు. ఈ మారణహోమం ఓండో రాష్ట్రంలోని సెయిట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో జరిగింది. 
 
ఆదివారం కావడంతో ఈ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఫాస్టర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. చర్చిపై బాంబులతో దాడి చేసి మరోవైపు కాల్పులు జరిాపరు. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా మారింది. ఈ దాడిలో ఎంత మంది మరణించారన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. కానీ, దాదాపు 50 మంది వరకు చనిపోయినట్టు మీడియా కథనాల సమాచారం. 
 
ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రం గర్భందాల్చి ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని అన్నారు. ఏది ఏమైనా ఈ దేశం ఎన్నటికీ దుష్టులకు తలొగ్గదన్నారు. చీకటి ఎప్పటికీ వెలుగునివ్వలేదన్నారు. చివరికి నైజీరియా గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. అయితే, ఈ మారణహోమానికి ఏ ఒక్క సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments