Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:11 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. 
 
ఘటనా స్థలంలో రెండు హ్యాండ్ గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన వారిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. పైగా, కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులకు ట్విటర్‌ ద్వారా హెచ్చరికలు చేశారు. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.
 
గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసుల ప్రకారం, డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ పరిసరాల్లో గుమిగూడిన జనంపై కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌత్ స్ట్రీట్‌లో పెద్ద జనసమూహం ఉన్న సమయంలో దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments