Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పల్నాడు జిల్లా రెంటచింతలలో రోడ్డు ప్రమాదం - ఆరుగురు దుర్మరణం

road accident
, సోమవారం, 30 మే 2022 (08:56 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా రెంటచింతలలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
కాగా, రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకుని తిరిగి తమ ఊరికి పయనమయ్యారు. వీరంతా మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం సంభవించింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన ఆగివున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఆ వాహనంలో ఉన్నవారంతా ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో అందుబాటులోకి వచ్చిన "ఐను" ఆస్పత్రి సేవలు