ఐఏఎస్​ అధికారికే టోకరా... కేవైసీ పేరుతో 6లక్షలు స్వాహా

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:34 IST)
ఓ ఐఏఎస్​ అధికారి మొబైల్​కు నకిలీ కెవైసీ లింక్​ను పంపి, బ్యాంక్​ నుంచి ఏకంగా 6.10 లక్షలను కాజేసిన ఘటన రాజస్థాన్ ఉదయ్​పుర్​లో చోటు చేసుకుంది. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సైబర్​ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల వలలో సామాన్య ప్రజలే కాదు ఐఏఎస్​ అధికారులూ పడుతున్నారు. తాజాగా రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లా ఐఏఎస్​ అధికారికి చరవాణికి నకిలీ కెవైసీ లింక్​ పంపి, బ్యాంక్​ ఖాతా నుంచి 6.10 లక్షలను కాజేశాడు ఓ మోసగాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ జరిగింది... రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లాలో జాడోల్​ సబ్​ డివిజన్​ మేజిస్ట్రేట్​గా చేస్తున్నారు డాక్టర్​ శుభమంగ్ల. అక్టోబర్​ 21న బ్యాంక్​ ఖాతాకు సంబంధించి కేవైసీ పూర్తి చేయాలంటూ ఆమె ఫోన్​కు ఓ లింక్​ పంపించాడు ఆగంతుకుడు.

ఆ లింక్​ ఓపెన్​ చేసి తనకు సంబంధించిన అన్ని వివరాలను నింపారు శుభ. పూర్తి చేసిన కొంత సమయం తర్వాత బ్యాంక్​ ఖాతా నుంచి మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా రూ. 6.10 లక్షల నగదు విత్​డ్రాఅయినట్లు ఆ ఐఏఎస్​ అధికారి గుర్తించారు.

నగదు బదిలీ కావటాన్ని గుర్తించిన ఆమె వెంటనే జాడోల్​ పోలీస్​ స్టేషన్​, ఉదయ్​పుర్ సైబర్​ సెల్​లో కేసు నమోదు చేశారు. కానీ ఆమె బ్యాంక్​ ఖాతా బెంగళూరులో తెరిచినందున అధికారులు ఈ కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసి విచారణను వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments