Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్​ అధికారికే టోకరా... కేవైసీ పేరుతో 6లక్షలు స్వాహా

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:34 IST)
ఓ ఐఏఎస్​ అధికారి మొబైల్​కు నకిలీ కెవైసీ లింక్​ను పంపి, బ్యాంక్​ నుంచి ఏకంగా 6.10 లక్షలను కాజేసిన ఘటన రాజస్థాన్ ఉదయ్​పుర్​లో చోటు చేసుకుంది. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సైబర్​ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల వలలో సామాన్య ప్రజలే కాదు ఐఏఎస్​ అధికారులూ పడుతున్నారు. తాజాగా రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లా ఐఏఎస్​ అధికారికి చరవాణికి నకిలీ కెవైసీ లింక్​ పంపి, బ్యాంక్​ ఖాతా నుంచి 6.10 లక్షలను కాజేశాడు ఓ మోసగాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ జరిగింది... రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లాలో జాడోల్​ సబ్​ డివిజన్​ మేజిస్ట్రేట్​గా చేస్తున్నారు డాక్టర్​ శుభమంగ్ల. అక్టోబర్​ 21న బ్యాంక్​ ఖాతాకు సంబంధించి కేవైసీ పూర్తి చేయాలంటూ ఆమె ఫోన్​కు ఓ లింక్​ పంపించాడు ఆగంతుకుడు.

ఆ లింక్​ ఓపెన్​ చేసి తనకు సంబంధించిన అన్ని వివరాలను నింపారు శుభ. పూర్తి చేసిన కొంత సమయం తర్వాత బ్యాంక్​ ఖాతా నుంచి మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా రూ. 6.10 లక్షల నగదు విత్​డ్రాఅయినట్లు ఆ ఐఏఎస్​ అధికారి గుర్తించారు.

నగదు బదిలీ కావటాన్ని గుర్తించిన ఆమె వెంటనే జాడోల్​ పోలీస్​ స్టేషన్​, ఉదయ్​పుర్ సైబర్​ సెల్​లో కేసు నమోదు చేశారు. కానీ ఆమె బ్యాంక్​ ఖాతా బెంగళూరులో తెరిచినందున అధికారులు ఈ కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసి విచారణను వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments