Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిహార్ జైలుకు సోనియా... ఎందుకో

తిహార్ జైలుకు సోనియా... ఎందుకో
, బుధవారం, 23 అక్టోబరు 2019 (20:53 IST)
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆయనకు మద్దతు ప్రకటించారు సోనియా. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాజకీయ కుట్రలో భాగంగానే భాజపా ప్రభుత్వం ఇదంతా చేస్తోందని శివకుమార్కు సోనియా తెలిపారు.

ఇతర నేతలనూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోని, ఎంపీ డీకే సురేష్ ఉన్నారు. గత నెలలో అరెస్టు గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది.

పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు శివ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో నిర్మించిన భవనాలు కూల్చివేత? మంత్రి బొత్స ఏమన్నారు?