తమిళనాడులో ఘోరం - రథోత్సవంలో అపశృతి - 11 మంది మృతి

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:35 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. తంజావూరు నగరంలో జరిగిన ఓ ఆలయ రత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ జిల్లాలోని కలియమేడు అప్పర్ ఆలయ రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
అప్పర్ గురపూజై (అయ్యప్ప స్వామి పండుగ)ను పురస్కరించుని ప్రతి యేటా ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధుల గుండా లాగుతుండగా, ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలకు రథం తగిలింది. 
 
దీంతో ఒక్కసారికా విద్యుదాఘాతానికి గురికావడంతో 11మంది భక్తులు కాలి బూడిదయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments