Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సన్యాసిని.. నాకు ఓటెయ్యకుంటే నిన్ను శపిస్తా..

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (10:32 IST)
బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్‌ మళ్ళీ కొత్త వివాదానికి తెర లేపారు. ఉన్నావో నుంచి ఎంపీగా మళ్ళీ బరిలోకి దిగిన ఆయన ఓటర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యాలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది.
 
'నేను సన్యాసిని. మీ ఇంటికి వచ్చా.. మీ ఇంటి గడప దగ్గరున్న.. భిక్షం అడుగుతున్నా.. మీరు సన్యాసిని నిరాకరిస్తే.. మీ కుటుంబ సుఖ సంతోషాలను నేను తీసేసుకుంటాను (సంతోషాలు లేకుండా చేస్తా) మిమ్మల్ని శపిస్తా' అంటూ సాక్షి మహారాజ్‌ అన్నారు. అంతేకాకుండా పురాణాల్లో ఉన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారని ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని రాసింది.
 
నేను సన్యాసిని.. మీరు గెలిపిస్తే.. నేను గెలుస్తా.. లేకుంటే గుళ్లో నేను భజన చేసుకుంటా లేదా కీర్తనలు పాడుకుంటూ ఉంటా..అయితే ఇవాళ నేను ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చాను. మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను. సన్యాసిని మీరు నిరాకరిస్తే... మీ కుటుంబ సుఖసంతోషాలను నేను తీసేసుకుంటాను. మిమ్మల్ని శపిస్తానని సాక్షి మహారాజ్‌ ఓటర్లను బెదరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments