Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నిర్వహించిన ఏశాట్ ప్రయోగాన్ని సమర్థించిన అమెరికా రక్షణశాఖ..!

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (10:18 IST)
భారత్ నిర్వహించినటువంటి ఏశాట్ ప్రయోగాన్ని అమెరికా రక్షణ శాఖ సమర్థించింది. అంతరిక్ష ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ ఏశాట్ పరీక్షను నిర్వహించిందని, ఆ ప్రయోగం వల్ల ఎలాంటి నష్టం లేదని పెంటగాన్ తెలియజేసింది. మార్చి 27వ తేదీన దిగువ కక్ష్యలో ఉన్న ఓ ఉపగ్రహాన్ని భారత్ పేల్చివేసిన సంగతి తెలిసిందే. 
 
ఉపరితలం నుంచి గగనతలంలోని టార్గెట్‌లను చేధించే మిస్సైల్‌తో దానిని పేల్చారు. దీంతో ప్రపంచంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలిచింది. భారత్ నిర్వహించిన ఈ పరీక్షపై నాసా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ తాజాగా దీనిపై స్పందించింది. అంత‌రిక్ష ప్ర‌మాదాలు పొంచి ఉన్న నేప‌థ్యంలోనే భార‌త్ ఆ ప‌రీక్ష నిర్వ‌హించిన‌ట్లు యూఎస్ స్ట్రాట‌జిక్ క‌మాండ్ క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ జాన్ హైట‌న్ తెలిపారు. 
 
భారత్ తనను తాను రక్షించుకునే సత్తా ఉంది అని నిరూపించుకోవడానికి ఆ ప‌రీక్ష చేప‌ట్టార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉప‌గ్ర‌హాన్ని పేల్చ‌డం వ‌ల్ల సుమారు 400 వ్య‌ర్థాలు ఏర్ప‌డ్డాయ‌ని, వాటి వ‌ల్ల అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ‌కు ప్ర‌మాదం ఉంద‌ని నాసా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments