Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ వంటి భయస్థుడుని ఎప్పుడూ చూడలేదు : ప్రియాంకా గాంధీ

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (11:24 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రత్నసింగ్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, మోడీ వంటి భయస్థుడు, బలహీనమైన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ మరిచారని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. 
 
తమ పార్టీ  లేదా తమ పార్టీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రాగానే పేదల కోసం తీసుకొచ్చిన న్యాయ్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. అలాగే, తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments