Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ నుండి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:52 IST)
మొబైల్ రంగంలో ప్రస్తుతం 4జీ హవా నడుస్తోంది. అయితే అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 5జీ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు మరింత వేగవంతమైన నెట్‌వర్క్‌ని అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మొబైళ్ల తయారీ, అమ్మకాల్లో కూడా అదే ఊపు కనిపిస్తోంది.
 
ప్రస్తుతం 4జీ కంటే మరింత మెరుగ్గా 5జీ సేవలను అందించేందుకు కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. భారత మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో షియోమీ 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 
 
ముందుగా ఊహించినట్లుగానే 5జీ వర్షన్ ఎంఐ మిక్స్ 3ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే మార్కెట్‌లోకి రాదు. ఇది మే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌‌కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఎంఐ మిక్స్ 3 ప్రత్యేకతలు:
డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 
19.5:9 యాస్పెక్ట్ రేషియో, 
2,340 x 1,080 స్క్రీన్ రిజల్యూషన్
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
బ్యాటరీ: 3,800 ఎంఏహెచ్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 24+2 మెగాపిక్సెల్ కెమెరా
ధర: సుమారు రూ.48,000 ఉండవచ్చు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments