మొబైల్ రంగంలో ప్రస్తుతం 4జీ హవా నడుస్తోంది. అయితే అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 5జీ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు మరింత వేగవంతమైన నెట్వర్క్ని అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మొబైళ్ల తయారీ, అమ్మకాల్లో కూడా అదే ఊపు కనిపిస్తోంది.
ప్రస్తుతం 4జీ కంటే మరింత మెరుగ్గా 5జీ సేవలను అందించేందుకు కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. భారత మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమి తొలి 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్లో షియోమీ 5జీ రెడీ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది.
ముందుగా ఊహించినట్లుగానే 5జీ వర్షన్ ఎంఐ మిక్స్ 3ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడే మార్కెట్లోకి రాదు. ఇది మే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది.