Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి ఉన్మాదానికి రెండేళ్ల చిన్నారి బలి

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:54 IST)
తండ్రి ఉన్మాదత్వమో లేక మానసిక లోపమో, అతని చేతిలో రెండేళ్ల పాప బలైపోయింది. ప్రక్కనే కూర్చుని టీవీ చూస్తున్న పాపను దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ఇంట్లో తండ్రీ, రెండేళ్ల కూతురు ప్రక్కప్రక్కన కూర్చుని టీవీ చూస్తున్నారు. 
 
ఇంతలో తండ్రికి ఏమైందో తెలియదు, అప్పటి వరకూ పాప తలను నెమ్మదిగా నెరుముతున్న అతను మెల్లగా సోఫాలో నుండి లెచాడు. తిన్నగా వెళ్లి ఓ సుత్తి తెచ్చాడు. కూర్చుని ఉన్న పాప తలపై గట్టిగా కొట్టాడు. చనిపోయే వరకూ అలాగే కొడుతూనే ఉన్నాడు. చివరికి పాప అరిచి అరిచి చనిపోయింది. శవాన్ని తీసుకువెళ్లి బెడ్‌రూంలో ఓ బీరువాలో దాచాడు. ఆ బిగ్గర కేకలకు చుట్టుప్రక్కల వారు తరలివచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఇంటి ముందు నగ్నంగా కూర్చుని ఉన్న తండ్రిని చూసారు. లోపలికి వెళ్లి తనిఖీ చేసారు. పాప శవాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం మా జీవితంలో ఓ పీడకల లాంటిదని, ఇది చూస్తే రాత్రి నిద్ర కూడా పట్టదని పోలీసులు చెప్పారు. కానీ తండ్రి మాత్రం ఆ సమయంలో తనకి మనుసు స్వాధీనంలో లేదని, తను కావాలని ఈ పని చేయలేదని వాదిస్తున్నాడు. ఏది ఏమైనా అతనికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments