"మూన్‌లైటింగ్" ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం విప్రో

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (08:39 IST)
దేశంలోని టెక్ కంపెనీల్లో ఒకటైన విప్రో.. ఉద్యోగులకు తేరుకోలోని షాకిచ్చింది. ఇతర కంపెనీల కోసం పని చేసే తమ ఉద్యోగుల్లో 300 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఒకే సమయంలో ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడాన్ని (మూన్‌‌లైటింగ్‌) సహించేది లేదని ఇటీవల ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు ప్రకటించిన సంగతి విదితమే. 
 
తాజా చర్యతో ఉద్యోగులకు తన కఠిన వైఖరిని విప్రో స్పష్టం చేసినట్లయ్యింది. విప్రోలో ఉద్యోగం చేస్తూ, పోటీ సంస్థల కోసమూ పనిచేసే వారికి తమ వద్ద స్థానం లేదని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ తేల్చి చెప్పారు. మూన్‌ లైటింగ్‌ ప్రక్రియ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైనదిగా అభివర్ణించారు. 
 
'వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కారణంగా విప్రో ఉద్యోగుల్లో కొందరు పోటీ సంస్థలకూ ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో ఇలా పనిచేస్తున్న 300 మందిని గుర్తించాం. వీరిని విధుల నుంచి తొలగించాం" అని ఏఐఎంఏ కార్యక్రమంలో రిషద్‌ వెల్లడించారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రిషద్‌ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments