Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటకలో విషాహారం తిని 20 కోతులు మృతి

కర్ణాటకలో విషాహారం తిని 20 కోతులు మృతి
, గురువారం, 30 సెప్టెంబరు 2021 (20:52 IST)
కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు కోతులను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషమిచ్చి వాటిని చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 
 
కోతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని కోలార్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సెల్వమణి తెలిపారు. కాగా గతంలో కూడా కర్ణాటకలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితంలో పవన్ కళ్యాణ్‌కి అది వల్లకాదు, సాధిస్తే సన్యాసం తీసుకుంటా