ఫేస్‌బుక్‌తో శాంసంగ్ ఇండియా ఒప్పందం.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 28 మే 2020 (19:50 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు శాంసంగ్‌ ఇండియా ప్రకటించింది. సాధారణ రిటైల్‌ దుకాణదార్లు కూడా ఆన్‌లైన్‌కు వెళ్లేలా శిక్షణ ఇచ్చే నిమిత్తం.. ఈ డీల్ కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో ఉన్న రిటైల్‌ భాగస్వాములు డిజిటల్‌కు వెళతారని శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మొబైల్‌ బిజినెస్‌) మన్‌దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు.
 
ఇప్పటికే తొలి దశ కింద 800కు పైగా ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు శిక్షణ ఇవ్వగా.. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని శిక్షణ శిబిరాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. సాధారణ రిటైలర్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా బిజినెస్‌ పేజీలు ఏర్పాటు చేసుకోవడం, వినియోగదార్లకు స్మార్ట్‌ఫోన్ల గురించి ఎక్కువ వివరాలను అందించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments