Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతినాయుడిపై పడిన శ్రీరెడ్డి.. చిరంజీవి ఫ్యామిలీని లాగింది..

Advertiesment
Sri Reddy
, మంగళవారం, 12 మే 2020 (17:41 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం శృంగార తార స్వాతి నాయుడిపై పడింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతి నాయుడికి శ్రీరెడ్డి అభినందిస్తూనే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని మధ్యలోకి లాగింది. సమయం సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే శ్రీరెడ్డి తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. 
 
స్వాతి నాయుడుకు పండంటి బిడ్డ పుట్టడంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. 'కంగ్రాట్స్ స్వాతి.. ఏది ఏమైనప్పటికీ నువ్ చిరంజీవి కుటుంబానికి చెందినదానివి కాదు కదా.. అందుకే నీ బిడ్డ ఫోటో వైరల్ కాలేదు..అయినప్పటికీ గాడ్ బ్లెస్ యూ'అని పేర్కొంది. శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ బాగానే వైరల్ అవుతోంది.
 
స్వాతి నాయుడుకు కంగ్రాట్స్ చెప్పే కొద్ది క్షణాల క్రితమే హైపర్ ఆది పెళ్లి వార్తలపై శ్రీరెడ్డి మండిపడింది. 'హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?' అని పోస్ట్ చేసింది. 
webdunia
Srireddy
 
కాగా, శృంగార తార స్వాతి నాయుడు 2019లో తాను ప్రేమించిన అవినాష్‌ను వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం స్వాతినాయుడు సీమంతం వేడుక విజయవాడలో నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తెల్లవారు జామున పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గబ్బర్ సింగ్' కోసం కుర్రపిల్లను ఫిక్స్ చేసిన హరీశ్ శంకర్?!