Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ ఉపయోగిస్తున్నారా? ఐసిస్ వైరస్ సోకిందట.. బీ కేర్ ఫుల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (16:16 IST)
టిక్ టాక్ ఉపయోగిస్తున్నారా? అయితే ఐసిస్ అనే కొత్త వైరస్‌తో జాగ్రత్త పాటించాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో యాప్స్‌లో బాగా పాపులరైన టిక్ టాక్ ఒకటి దీన్ని 30శాతం మంది 18ఏళ్ల లోపు వారే ఉపయోగిస్తున్నారు. అలాంటి ఈ యాప్‌ను ఐసిస్ వైరస్ అంటే ఐసిస్ టెర్రరిస్టులు ఉపయోగిస్తున్నారు.

ఐసిస్‌ టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తూ, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్‌ చేస్తున్నారు. గత మూడు వారాల నుంచే ఈ వైరస్‌ ప్రారంభమైంది.
 
వీటిని చూసి ఉలిక్కిపడిన 'టిక్‌టాక్‌' కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తోంది. గత వారం ఐసిస్‌ టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్‌ నుంచి యాజమాన్యం తొలగించే లోగానే అవి డజన్‌ ఖాతాలకు షేర్‌ అయ్యాయి. 175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్‌ అయినట్లు టిక్ టాక్ యాజమాన్యం గుర్తించింది. 
 
ఈ వీడియోల్లో టెర్రరిస్టులు తుపాకులు గాల్లోకి ఎత్తి పాటలు పాడుతున్న దృశ్యాలు, ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ రక్తనాళాలను చాకుతో తెగ నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే సీన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెర్రరిస్టుల పోస్టింగ్‌లను ఎవరు షేర్‌ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments