హర్యానాలో కర్నాటక రాజకీయం పునరావృతం కాదు : జీవీఎల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (15:58 IST)
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానా రాష్ట్రంలో కర్నాటక రాజకీయాలు పునరావృతం కానివ్వబోమని బీజేపీ రాజ్యసభ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. గురువారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోగా, హర్యానా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఐదు సీట్ల దూరంలో వచ్చి ఆగిపోయింది. 
 
ఈ ఫలితాలపై జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ, హర్యానాలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా కర్ణాటక తరహా పరిస్థితి రాబోదని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అటు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందన్నారు. హర్యానాలో స్థానిక పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారాయని, అందుకే ఈ తరహా ఫలితాలు వెల్లడైనట్టు తెలిపారు. 
 
మరోవైపు, మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యానా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగించాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను కూడా గెలవలేకపోయింది. దీంతో ఇతరులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments