హువావే కంపెనీ నుంచి మేట్ప్యాడ్ టి8 పేరిట నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ భారత్లో విడుదలైంది. ఈ ట్యాబ్ను సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్ కార్ట్లో విక్రయిస్తారు. ఇందులో 8 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
MatePad T8
ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్ను అమర్చారు. 2జీబీ ర్యామ్ను ఏర్పాటు చేశారు. వెనుక, ముందు 5, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ను ఇందులో అందిస్తున్నారు. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
హువావే మేట్ ప్యాడ్ టి8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ డీప్ సీ బ్లూ కలర్ ఆప్షన్లో విడుదలైంది. ఈ ట్యాబ్లెట్కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, ఎల్టీఈ వేరియెంట్ ధర రూ.10,999గా ఉంది.