Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలి.. ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:10 IST)
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలైన కాలంలో మే 1 నుంచి శ్రామిక్ రైళ్ళను నడిపారు. వీటి ద్వారా లక్షలాది మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రస్తుతం అన్‌లాక్ అమలవుతున్నందువల్ల స్వస్థలాల నుంచి ఉపాధి కోసం మళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. వలస కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తిరిగి వెళ్ళేందుకు శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన రాసిన లేఖలో ఒడిశా నుంచి వలస కూలీలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళేందుకు శ్రామిక్ రైళ్ళను పునరుద్ధరించాలని కోరారు.
 
వలస కూలీలకు జీవనోపాధి అత్యవసరమని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మనదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవలసిన అవసరం ఉందని తెలిపారు. ఒడిశాలో వలస కూలీలు దయనీయ స్థితిలో ఉన్నట్లు చెప్పారు. వారికి జీవనోపాధి అవసరమని పేర్కొన్నారు. 
 
వలస కూలీలు తమకు ఉపాధి దొరికే ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా ఒడిశా నుంచి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళను పునరుద్ధరించాలని, ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments