Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో భారత్‌లో అడుగుపెడతాం.. సౌత్ కొరియా కంపెనీ

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:02 IST)
చైనాకు చెందిన 118 యాప్‌ల తొలగింపులో భాగంగా పబ్జీని కూడా ఇటీవల భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ గేమ్ తయారు చేసిన సౌత్ కొరియా కంపెనీ స్పందించింది. తిరిగి భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నట్టుగా తెలిపింది. 
 
తాము పరిస్థితులను అన్నింటిని గమనిస్తున్నామని, త్వరలోనే భారత్‌లో అడుగుపెడతామని ధీమాగా చెప్తోంది.  చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది.  
 
వాస్తవానికి పబ్జీ గేమ్‌ను సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ తయారు చేసింది. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తోంది. దీంతో భారత్‌లో ఈ వర్షన్‌పై నిషేధం విధించారు. ఈ చర్యతో సౌత్ కొరియా కంపెనీ దిగివచ్చింది. 
 
ఇక నుంచి తమ గేమింగ్ యాప్‌తో టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించింది. రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments