Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియ్ న్యూ ఆఫర్ : రూ.247 రీచార్జ్‌తో 84 డేస్ వ్యాలిడిటి

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:11 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లలో 297 ఆఫర్‌పై రూ.50 రాయితీని ఇచ్చింది. అంటే రూ.247కు రీచార్జ్ చేసుకున్నట్టయితే 84 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పొందాలంటే కేవలం జియో మై యాప్‌లోకి వెళ్లి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మై జియో అప్లికేషన్‌లో రూ.297ను రూ.247కే అందిస్తున్నారు. 
 
కాగా, దేశీయ టెలికాం రంగంలోకి రెండేళ్ళ క్రితం అడుగుపెట్టిన రిలయన్స్ జియో 28 కోట్ల మంది కస్టమర్లను చేజిక్కించుకున్న విషయం తెల్సిందే. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు. ఫలితంగా పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తాజాగా రూ.247కే 84 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు.. అదనంగా 500 ఎంబీ 4జీ డేటాను కూడా ఇవ్వనుంది. అన్‌లిమిటెడ్ పరిమితి దాటిన పక్షంలో డేటా వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. కాగా, రూ.349 ప్యాక్‌పై రూ.50 ఆఫర్ ఇస్తూ వస్తుంది. అంటే రూ.349 ప్యాక్‌ రూ.299కే అందిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments