Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ప్రతి ఒక్కరూ ట్విట్టర్‌కు డబ్బులు చెల్లించాల్సిందే.. ఎలాన్ మస్క్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (15:25 IST)
ఇకపై ప్రతి ఒక్క ట్విట్టర్ యూజర్ ఇకపై ఎంతో కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇప్పటికే ప్రీమియర్ యూజర్ల నుంచి ఆయన నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇకపై ట్విట్టర్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించేలా మార్పులు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. 
 
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. ఎక్స్‌ (ట్విట్టర్ ఖాతా)ను వాడే వారు ప్రతి నెలా 'స్వల్ప మొత్తం' చెల్లించాల్సి ఉంటుందని మస్క్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉందని ఆయన వివరించారు. బాట్స్‌ను తొలగించేందుకు ఇది ఓ చర్య అని వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఎక్స్ 550 మిలియన్ నెలవారీ యూజర్లు ఉండగా.. సగటున రోజుకు 100-200 మిలియన్ పోస్టులు పెడుతుంటారని చెప్పారు. ఇందులో బాట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బాట్స్‌ను తొలగించాలంటే స్వల్ప మొత్తంలోనైనా ఫీజు వసూలు చేయడం అవసరమంటూ మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల బాట్స్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలవుతుందన్నారు. ట్విటర్ కొనుగోలు సమయంలోనూ బాట్స్ గురించి మస్క్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మర్డర్స్ కేసులను పోలీసులు ఎలా సాధిస్తారలో కథతో హైడ్ న్ సిక్

కొత్తదనంలేని విజయ్ గోట్ - సమీక్ష

'అందం'తో వరుస ఛాన్సులు అందిపుచ్చుకుంటున్న మీనాక్షి!!

హిట్ 3లో అర్జున్ సర్కార్ గా నేచురల్ స్టార్ నాని లుక్

పది లక్షల విరాళం అందచేసిన అంబికా దర్బార్ బత్తి సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ఏంటి లాభం?

శరదృతువు వచ్చింది .. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆనందం పంచుతుంది

ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు

మహిళలూ యవ్వనంగా వుండాలంటే.. జొన్నరొట్టె తినాల్సిందే..

తర్వాతి కథనం
Show comments