Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నుంచి పరిపాలన - ముహూర్తం ఖరారు చేసిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:40 IST)
విశాఖపట్టణం పరిపాలన సాగించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం విజయదశమి పండుగను ముహూర్తంగా ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. పరిపాలన కోసం అవసరమైన కార్యాలయాల నిర్ధారణ కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, గురువారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలను సీరియస్‍గా తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ఆయన తమ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. 
 
ప్రత్యేక కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని, దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాడేపల్లిలో బుధవారం ఏపీ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సంబంధిత మంత్రులు అన్ని అంశాలతో సభకు రావాలని కోరారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్నారు. కాగా, గురువారం నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments