Webdunia - Bharat's app for daily news and videos

Install App

6జీపై కన్నేసిన చైనా.. వైర్‌లెస్ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యం

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (16:25 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 5జీ సాంకేతికతను అందిపుచ్చుకునే పనిలో ఉండగా.. చైనా అప్పుడే 6జీ పరిశోధనలకు రంగం సిద్ధం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వున్న 4జీతో పోలిస్తే 5జీలో కనీసం 20 రెట్లు వేగంగా డేటా లభిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలకు 5జీ ఎంతో ఉపకరిస్తుంది.
 
ఈ నేపథ్యంలో 5జీ సేవలను ప్రారంభించిన చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనా 6జీపై కన్నేసింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు ప్రారంభిందని ఆ దేశ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవలే సమావేశమైంది. 6జీ అభివృద్ధి పరిశోధనకు రెండు గ్రూపులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరుగుతున్నట్లు చైనా మీడియా తెలిపింది. 
 
ఈ మేరకు చైనా సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రి వాంగ్‌ షీ మాట్లాడుతూ .. 6జీ ఎంతో దూరంలో ఉంది. అయితే దీనికి సంబంధించిన పరిశోధనలు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. సాంకేతికపరంగా ఆచరించాల్సిన ప్రణాళికలు పూర్తిగా సిద్ధం కాలేదన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments